ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిరలో విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల నిరసన - అనంతపురం తాజా వార్తలు

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు మడకశిర విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారికి నేరుగా వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు.

మడకశిరలో విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల నిరసన
మడకశిరలో విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల నిరసన

By

Published : Nov 7, 2020, 6:20 PM IST

అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం ఎదుట ఒప్పంద కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతునే ఉన్నాయి. పవర్ జేఏసీ పిలుపుమేరకు గత నెల 19 నుంచి కార్మికులు తమ నిరసనను తెలియాజేస్తున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్న భోజన సమయంలో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారి నేరుగా వేతనాలను అందజేయాలని, ఈపీఎఫ్ అమలు చేయాలని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపి సంస్థలో పనిచేసే కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా విద్యుత్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details