ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండె గు'బిల్లు'.. పెంకుటిల్లుకు రూ.9,859 కరెంటు బిల్లు ! - Electricity consumer

Old Man Got High electricity bill : అతడో సాధారణ వ్యక్తి. డోలక్ వాయిద్యకారుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనది పెంకుటిల్లు.. మూడు బల్బులు, ఓ ఫ్యాన్. మహా అయితే విద్యుత్ బిల్లు రూ.300కు మించదు. కానీ గత నెల రూ.900 బిల్లు రావడంతో అధికారులను కలిస్తే.. చెల్లించక తప్పదు అన్నారు. పోనీలే..! అనుకుని అప్పుచేసి మరీ బిల్లు కట్టేశాడు. కానీ, ఈ నెల బిల్లు ఏకంగా రూ.9,859 రావడంతో షాకయ్యాడు. ఆఫీసుకు వెళ్లి అడిగితే మీటర్ రిపేర్ కోసం అదనంగా మరో వెయ్యి రూపాయలు కట్టమని సెలవిస్తున్నారు.. విద్యుత్ అధికారులు.

High electricity bill to dola worker in Gutti
వృద్ధుడికి తొమ్మిదివేల రూపాయలకు పైగా కరెంటు బిల్లు

By

Published : Apr 12, 2023, 7:59 PM IST

Old Man Got High electricity bill: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విద్యుత్ వినియోగదారుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెంకుటిల్లు ఇంటికి 9వేల 859 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ డోలక్ వాయిద్యకారుడు కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుత్తి పట్టణంలో షఫీ(60) అనే వృద్ధుడు డోలక్ వాయిద్యకారుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఉండేది పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లులో మూడు విద్యుత్ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది.

వృద్ధుడికి తొమ్మిదివేల రూపాయలకు పైగా కరెంటు బిల్లు

అయితే ఆ ఇంటికి నెలకు సాధారణంగా రూ.150 నుంచి రూ.250 వరకు కరెంట్ బిల్లు వస్తుండేది. అయితే గత రెండు నెలల నుంచి కరెంట్ బిల్లు అధికంగా వస్తుండడంతో ఆ బిల్లు చెల్లించేందుకు అతడు నానా ఇబ్బందులు పడుతుండేవాడు. కాగా గత నెల రూ. 900 కరెంట్ బిల్లు రావడంతో పొరపాటుగా ఏమన్నా వచ్చిందేమోనని విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాడు. అయితే వారు కచ్చితంగా కట్టాల్సిందేనని తెలపడంతో కార్మికుడు 900 రూపాయల కరెంటు బిల్లు చెల్లించాడు.

అయితే అతడికి ఊహించని మరో షాక్ ఎదురైంది. ఈ నెలకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైతొమ్మిది రూపాయల కరెంటు బిల్లు రావటంతో షఫీ కంగుతున్నాడు. ఒకపూట ఇల్లు గడవటానికే కష్టంగా ఉంటే ఇంత బిల్లు ఎలా చెల్లించాలని బాధపడుతూనే విద్యుత్​శాఖ అధికారులను సంప్రదించాడు. విద్యుత్ శాఖ అధికారులు మీటర్ జంప్ అయి ఉంటుందని చెప్పారు. మీటరును అనంతపూర్​కు పంపించి దాన్ని సరి చేయాలని వాటికి వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చవుతుందని వారు చెప్పారు.

దీంతోపాటు వచ్చిన ఆ కరెంటు బిల్లును కచ్చితంగా చెల్లించాల్సిందేనని విద్యుత్​శాఖ అధికారులు అతడికి చెప్పటంతో షఫీ కన్నీరుమున్నీరయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఈటీవీని ఆశ్రయించాడు. తనకు వచ్చిన ఆ విద్యుత్ బిల్లుపై మీడియాతో అతడి బాధను చెప్పుకున్నాడు. తన జీవనం గడవడానికే చాలా కష్టంగా ఉందని, ఇలా తొమ్మిది వేల పైచిలుకు బిల్లు వస్తే నేను ఎలా చెల్లించాలని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.

" నా పేరు షఫీ. మా ఇంట్లో మూడు బార్​ లైట్లు, ఒక ఫ్యాన్ ఉంది. అయితే నాకు ఈ నెల నాకు తొమ్మిది వేల పైచిలుకు కరెంటు బిల్లు వచ్చింది. తప్పుగా వచ్చిందేమో అని విద్యుత్​శాఖ అధికారులను సంప్రదించాను. అయితే వారు మీటర్ జంప్ అయి ఉంటుందని అంటున్నారు. దాన్ని రిపేరు చేయటం కోసం మరో వెయ్యిరూపాయల అదనపు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ కరెంటు బిల్లును మాత్రం ఎలాగైనా కట్టితీరాల్సిందేనని చెప్తున్నారు. నేను డోలా కార్మికుడిని. మాకు పూట గడవటానికే కష్టమవుతోంది. మేము ఇంత విద్యుత్ బిల్లు కట్టలేము. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి మా పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను." - షఫీ, డోలా కార్మికుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details