అనంతపురం జిల్లా రాప్తాడు మండల పరిధిలోని టీటీడీసీ కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో.. ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో సాల్మన్రాజు హాజరయ్యారు. సమాజం అభివృద్ధి చెందాలంటే... ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని.. అది ఓటుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలన్నారు.
ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో... ఓటుపై అవగాహన
సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని.. అది ఒక ఓటు తోనే సాధ్యమవుతుందని రాప్తాడు ఎస్సై ఆంజనేయులు అన్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈనాడు, ఈటీవీ - భారత్ నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
మాట్లాడుతున్న ఎస్సై ఆంజనేయులు