ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యతో వివాహేతర సంబంధం...వేటకొడవళ్లతో దాడి - crime at anantapur dst

వివాహేతర సంబంధాలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి..భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కట్టుకున్న భార్యను..లేదంటే అడ్డొచ్చిన ఆ పురుషుడిని అంతమొందిస్తున్నారు... భార్యల విషయంలోనూ ఇదే పరిస్థతి.. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై ఆ భర్త వేటకొడవళ్లతో దాడి చేశాడు.

due to illegal relations a husband attack on a person at anantapur dst thadipathri
భార్యతో అక్రమసంబంధం

By

Published : Mar 16, 2020, 11:34 PM IST

చికిత్సపొందుతున్న క్షతగాత్రులు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో వెలుగు సీసీ రామ్మోహన్​పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రామ్మోహన్ 9 నెలల క్రితం తాడిమర్రి నుంచి బదిలీపై తాడిపత్రి వెలుగు కార్యాలయానికి వచ్చాడు. తాడిమర్రిలో విధులు నిర్వహించే సమయంలో అక్కడికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయమై మహిళ భర్త, బంధువులు పలుమార్లు రామ్మోహన్​ను మందలించారు. అయినప్పటికీ రామ్మోహన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తాడిమర్రి నుంచి మహిళ భర్త రాజారెడ్డి, సమీప బంధువైన రామలింగారెడ్డితో కలిసి తాడిపత్రి వెలుగు కార్యాలయంలోకి వచ్చారు. రామ్మోహన్​తో వాగ్వాదానికి దిగి తమతో తెచ్చుకున్న వేట కొడవళ్ళతో దాడికి దిగారు.

అక్కడే ఉన్న కొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రాజారెడ్డి చేతిలోని కొడవలి లాక్కొని రాజారెడ్డి చేతిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ పోలీసులు వెలుగు కార్యాలయం వద్దకు వచ్చారు. పారిపోతున్న రాజారెడ్డిని అదుపులోకి తీసుకునని ఆసుపత్రికి తరలించారు. పరారిలో ఉన్న మరో నిందితుడు రామలింగారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే తీవ్ర గాయాలయ్యి రక్తపు మడుగులో ఉన్న రామ్మోహన్​ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామ్మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం పంపించారు.

ఇదీ చూడండిప్రియుడే అల్లుడు... విషయం తెలిసి నవవధువు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details