ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 11:53 AM IST

ETV Bharat / state

రెడ్​జోన్​గా సాయినగర్ కాలనీ

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సాయినగర్​ను అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. కరోనాతో మృతి చెందిన మహిళ ద్వారా మరో ఐదుగురికి వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

due to corona Sayanagar Colony as Red Zone in dharmavaram town in ananthapuram disrict
due to corona Sayanagar Colony as Red Zone in dharmavaram town in ananthapuram disrict

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం సాయినగర్​ కాలనీలో... కరోనా లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడం మరో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు సాయినగర్ కాలనీని రెడ్​జోన్​గా ప్రకటించి... రాకపోకలు నిలిపివేశారు. ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బుధవారం రాత్రి రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details