ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 11:03 PM IST

ETV Bharat / state

కంటైన్మెంట్​ జోన్​లో పర్యటించిన డీఎస్పీ

పుట్లూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో... ఆ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు కంటైన్మెంట్​ జోన్​ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కంటైన్మెంట్​ జోన్​ను పర్యటించిన డీఎస్పీ
కంటైన్మెంట్​ జోన్​ను పర్యటించిన డీఎస్పీ

అనంతపురం జిల్లా పుట్లూరులోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావటంతో... అధికారులు ఆ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు పుట్లూరులో కంటైన్మెంట్​ జోన్​ను పరిశీలించారు. అనంతరం పోలీస్​ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపై తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో నిర్ణీత వేళల్లో మాత్రమే నిత్యావసర సరకులకు అనుమతించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:'వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు'

ABOUT THE AUTHOR

...view details