హిందూపురంలోని కొవిడ్-19 ఆసుపత్రి, ప్రయోగశాలను జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి తనిఖీ చేసి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆసుపత్రిని హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని అన్నారు. రాబోయే కాలంలో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తలు తీసుకునే విధంగా సలహాలు, సూచనలను హిందూపురంలోని అధికారులకు తెలిపామన్నారు.