ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 7:55 PM IST

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో అన్నార్తులకు నిత్యావసరాల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials to others in Anantapur district
అనంతపురం జిల్లాలో అన్నార్తులకు నిత్యావసరాల పంపిణీ

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో తెదేపా రంగాపురం తెలుగుయువత ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నార్తులను ఆదుకునేందకు ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details