అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలోని దినసరి కూలీలకు స్థానిక తెదేపా నాయకుడు చింబిలి వెంకట రమణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
తాడిపత్రిలో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - lockdown in tadipathri
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
![తాడిపత్రిలో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ Distribution of Essential Items for the Poor in thadipathri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6667295-609-6667295-1586063237393.jpg)
తాడిపత్రిలో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ