ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.. తెలంగాణవాసిగా గుర్తింపు - చెన్నై ఎక్స్​ప్రెస్​లో మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు

ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్​ప్రెస్​లో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో​ చోటు చేసుకుంది. గుత్తి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు

By

Published : Jul 19, 2019, 6:06 PM IST

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు

అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ గుండా (11041) ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలు​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు గుత్తి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన నవీన్​గా గుర్తించారు‍.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details