ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెక్​ డ్యాములు ధ్వంసం.. అధికారులకు ఫిర్యాదు - check dams news

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో చెక్​ డ్యాములను దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై.. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

check dams
చెక్​ డ్యాములను ధ్వంసం చేసి మళ్లిస్తున్న నీరు

By

Published : Dec 1, 2020, 12:51 PM IST

అనంతపురం జిల్లా కటారుపల్లి పరిసరాల్లో వర్షపు నీటిని నిల్వ ఉంచుకునేలా వాగులపై చెక్​డ్యామ్స్​ నిర్మించారు. వీటివల్ల పరిసర ప్రాంతాల్లోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెప్పారు. వేసవిలో అటవీ ప్రాంతంలోని మూగజీవాల దాహార్తిని సైతం తీరుస్తున్నాయన్నారు. కానీ..కొందరు వ్యక్తులు తమ గ్రామంలోని చెరువులు నింపుకునేందుకు చెక్​ డ్యాములను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయమై కటారుపల్లి వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details