ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్నుల జీవోను రద్దు చేయాలని సీపీఏం ధర్నా - హిందూపురంలో సీపీఏం ధర్నా

అనంతపురం జిల్లా హిందూపురంలో సీపీఏం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన పన్నుల పెంపు జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

cpm protest at hindhupuram
హిందూపురంలో సీపీఏం ధర్నా

By

Published : Dec 2, 2020, 2:48 PM IST

ఇంటిపన్ను, నీటిపన్ను చెత్తపన్ను పెంపు జీవోను రద్దు చేయాలని అనంతపురం జిల్లా హిందూపురంలో సీపీఏం నిరసన వ్యక్తం చేసింది. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను నిరసన కార్యక్రమంలో భాగంగా కాల్చివేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో. 196-197 సామాన్యులకు భారంగా మారే పరిస్థితి ఏర్పడిందని.. జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details