ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2021, 6:37 AM IST

ETV Bharat / state

'వ్యవసాయ పరిశోధన కేంద్ర తరలింపు జీవోను ఉపసంహరించుకోవాలి'

నంద్యాలలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రం తరలించడానికి తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్​ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నాణ్యత గల విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించినట్లు చెప్పారు.

cpm
cpm

నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని తరలించాలని తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు ఈ విషయంపై లేఖ రాసినట్లు చెప్పారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన లేఖను విడుదల చేశారు.

పరిశోధన కేంద్రం ఉన్న 50 ఎకరాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు నాణ్యతతో కూడిన విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించారని గుర్తుచేశారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తామేమీ వ్యతిరేకం కాదని, అయితే వ్యవసాయ కేంద్రానికి సంబంధించిన స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details