ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2021, 9:34 PM IST

ETV Bharat / state

అనుమతులు లేకుండా పునాదులు.. సీపీఎం నాయకులు అరెస్ట్

అనంతపురం జిల్లాలో అనుమతులు లేకుండా పునాదులు తవ్వుతున్న సీపీఎం నాయకులను, లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా.. ఇప్పటివరకు వారికి స్థలాలు చూపించలేదు. దీంతో లబ్ధిదారులు నాయకులతో కలిసి పునాదులు తవ్వడం ప్రారంభించారు.

cpm leaders agitation
cpm leaders agitation

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని నక్కలగుట్ట కాలనీలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించిన అధికారులు స్థలం చూపించక పోవడంతో.. రెండు రోజులుగా వామ పక్షాల ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు సీపీఎం నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులు నక్కలగుట్ట సమీపంలో పునాదులు తవ్వడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్, సోమందేపల్లి ఎస్సై వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ చెప్పారు. వారు వాగ్వాదానికి దిగడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details