ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవుకు సిజేరియన్...ఆవు, దూడ క్షేమం - cow ceaserian at ananthapuram district

ఓ ఆవుకు సిజేరియన్ చేసి దూడను బయటికి తీసిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. ఆవు, దూడ రెండు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

cow  ceaserian at kalyanadurgam
ఆవుకు సిజేరియన్

By

Published : May 15, 2020, 11:52 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ ఆవుకు సిజేరియన్ చేసి దూడను బయటకు తీశారు. కణేకల్​కు చెందిన రైతు వన్నూరుస్వామికి చెందిన ఆవు ఈనేందుకు ఇబ్బంది పడుతుండగా వారు ఆవును కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకెళ్లారు. దానికి పశుసంవర్థక శాఖ ఏడి డా. నాగలింగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డా. రవితేజ, డా. వీరేశ్, డా. మంజునాథ్, పశువైద్య సిబ్బంది ఆవుకు శస్త్రచికిత్స చేసి దూడను బయటికి తీశారు. ఆవు, దూడ రెండు క్షేమంగా ఉన్నాయి. తన ఖరీదైనా ఆవును బ్రతికించినందుకు వైద్యులకు రైతు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చూడండి:వలసకూలీల కష్టాలు ఎప్పుడు తీరేనో..!

ABOUT THE AUTHOR

...view details