ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 4:22 PM IST

ETV Bharat / state

కొవిడ్ మొబైల్ వాహనం.. పరీక్షలు చేయించుకునేందుకు జనం ఆరాటం

అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 మొబైల్ వాహనంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. పరీక్షలు చేసిన అరగంటలోనే ఫలితాలను వెల్లడి చేస్తున్నారు.

covid 19 mobile vehicle in madakasira ananthapuram district
కొవిడ్ మొబైల్ వాహనం

అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 మొబైల్ వాహనంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. పట్టణంలో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ కారణంగా.. వృద్ధులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు అధికార యంత్రాంగం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. చాలామంది పరీక్ష చేయించుకునేందుకు వచ్చారు. అరగంటలోనే ఫలితాలను సిబ్బంది వెల్లడిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details