ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కియా ఉద్యోగికి కరోనా పాజిటివ్ - Corona in Kia latest news

అనంతపురం పట్టణంలోని కియా మోటార్స్​లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్​కు వచ్చాడని....అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కియా యాజమాన్యం పేర్కొంది.

Corona positive to  Kia employee  in anantapur district
కియా ఉద్యోగికి కరోనా పాజిటివ్

By

Published : Jun 4, 2020, 5:02 PM IST

అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ఆఫ్ ఇండియా సంస్థలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. సంస్థలో 545 ఉద్యోగులకు నిర్ధరణ పరీక్షలు చేయగా..అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ..అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఉద్యోగి...26న అక్కడి నుంచి ఏపీకి వచ్చాడని.... ఉద్యోగి శాంపిల్స్​ను 27న తీసుకున్నామని తెలియజేశారు. నిర్ధరణ పరీక్షల్లో అతనికి కరోనా వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనిని ఆసుపత్రికి తరలించామని కియా పేర్కొంది. కరోనా అనుమానితులకు పరీక్షలు చేస్తున్నామని... ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండేలా చర్యలు చేపట్టామని యజామాన్యం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details