ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుత్తి సబ్​జైలులో కరోనా కలకలం

By

Published : Apr 13, 2021, 7:21 AM IST

అనంతపురం జిల్లా గుత్తి సబ్​జైలులో ఆరుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా సోకింది. వారిని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని జైలు సూపరింటెండెంట్ రమేశ్ బాబు తెలిపారు.

గుత్తి సబ్​జైలులో కరోనా కలకలం
గుత్తి సబ్​జైలులో కరోనా కలకలం

అనంతపురం జిల్లా గుత్తి సబ్​జైలులో ఆరుగురు ఖైదీలకు కరోనా సోకిందని జైలు సూపరిండెంట్ రమేశ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమానంతో 50 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.

వారిలో ఆరుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వైరస్ సోకిన ఆ ఆరుగురిని జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details