ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - కరోనా బులిటెన్​ తాజా వార్తలు

అనంత ప్రజలను కరోనా వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే పట్టణంలో పదిమందికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అప్రమత్తమైన అధికారులు సమావేశమై కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

corona cases increased at anantapuram
అనంతలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 28, 2020, 12:55 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో కరోనా వైరస్ విస్తరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే పట్టణంలో పదిమందికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పట్టణంతో పాటు తలుపుల మండలం, కుమ్మర వాండ్లపల్లి, వెంగలమ్మ చెరువు గ్రామాలలో మరో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరిలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 50కు చేరింది. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మున్సిపల్, సచివాలయ, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. పట్టణంలో చేపట్టాల్సిన చర్యలపై తహసీల్దార్ మారుతి పలు సూచనలు చేశారు. నిబంధనలు కఠినతరం చేస్తూ తొమ్మిది గంటలకే అత్యవసరం మినహా మిగతా దుకాణాలు మూసి వేసేలా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details