అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. పాజిటివ్ కేసు వ్యక్తి ఎవరెవరిని కలిసారో తెలుసుకుని ఆ వ్యక్తులను పట్టణంలోని క్వారంటైన్కు తరలించారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి క్వారంటైన్ సెంటర్ను సందర్శించారు. కేంద్రంలోని వారి ఆరోగ్యం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ధైర్యం నింపారు. కరోనా నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు.
క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే - అనంతపురంలో క్వారంటైన్ కేంద్రాలు
అనంతపురం జిల్లా మడకశిరలోని క్వారంటైన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే తిప్పేస్వామి సందర్శించారు. అక్కడి వారి ఆరోగ్యం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
![క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే corona cases in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7166890-211-7166890-1589281609807.jpg)
corona cases in ananthapuram
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి