ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2021, 4:15 PM IST

ETV Bharat / state

ఆ ఊరి వాళ్లకు భయం లేదు.. ఉన్నతాధికారులూ స్పందించండి!

కరోనా సెకండ్​ వేవ్​ విజృభిస్తోంది. పాజిటివ్​ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. ప్రజల్లోనూ భయాందోళన ఎక్కువైంది. నియంత్రణా చర్యల్లో భాగంగా అధికారులు కొవిడ్​ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామస్థులు మాత్రం కరోనా తమనేమీ చేయదంటూ.. నిబంధనలు పాటించట్లేదు. ఈ విషయంపై గ్రామ సచివాలయ సిబ్బంది.. పైఅధికారులకి ఫిర్యాదు చేశారు.

villagers
గ్రామస్థుల నిర్లక్ష్యం

పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా కొవిడ్​ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వైద్య, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామస్థుల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రామంలో సుమారు 45 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కానీ వాళ్లలో ఎటువంటి భయం లేకుండా రచ్చబండలపైన గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తున్నారు.

గ్రామ సచివాలయ మహిళా పోలీసు.. కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు. వారు వినకపోవటంపై.. ఉన్నతాధికారులు స్పందించాలని ఆడియో సందేశం ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక్కో కుటుంబంలో ఐదారు కరోనా కేసులు ఉన్నాయని.. కొవిడ్​ సోకిన ఏ ఒక్కరూ.. హోమ్​ క్వారంటైన్​లో ఉండట్లేదని చెప్పారు. తాము ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సచివాలయ ఉద్యోగులూ కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details