ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాతో కాదు.. వదంతులతో పౌల్ట్రీకి ప్రమాదం

By

Published : Mar 13, 2020, 1:40 PM IST

కరోనా వైరస్ (కోవిడ్-19) మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది కాని.. జంతువులకు రాదని కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులు కోడి మాంసంతో పాటు గుడ్లు తిని ప్రజలకు కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు.

collector gandham chandrudu
కరోనా వైరస్​పై జిల్లా కలెక్టర్​ అవగాహన కార్యక్రమం

కరోనా వైరస్​పై జిల్లా కలెక్టర్​ అవగాహన కార్యక్రమం

కోడి మాంసం, గుడ్డు తినడం వలన కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందదని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగంతో పాటు అనుబంధంగా ఆధారపడ్డ వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భవిష్యత్​లో కోడి మాంసం, గుడ్లు అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలెవరూ అపోహలకు గురి కావద్దని, నిర్భయంగా వాటిని తినవచ్చని సూచించారు. మరోవైపు జిల్లాలో కరోనా కేసులు, అనుమానితులు కాని లేరని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details