ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హక్కులు తెలుసుకుని హుందాగా జీవించండి'

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ.. ఉపాధి హామీ కూలీలకు వారి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. హక్కులు తెలుసుకుని, సంపాదించుకునే సొమ్ముతో కూలీలు హుందాగా బతకాలని.. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు.

By

Published : Dec 12, 2020, 7:36 PM IST

collector in rights awareness program
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్

సమాజంలో అన్ని వర్గాల ప్రజలూ తమ హక్కులను తెలుసుకుని జీవించాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో ఉపాధిహామీ కూలీల కోసం ఆర్డీటి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన.. హక్కులపై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రాజ్యాంగంలో పేదలకు కల్పించిన హక్కులపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రత్యేకించి ఉపాధి హామీ కూలీలు తమ హక్కులను తెలుసుకొని.. సంపాదించుకునే సొమ్ముతో హుందాగా బతకాలని పిలుపునిచ్చారు. పలువురు గ్రామీణ ప్రాంత కూలీలు.. ఈ కార్యక్రమంలో పాల్గొని అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details