వైఎస్సార్ కంటి వెలుగు... రేపు అనంతలో సీఎం శ్రీకారం - #cmjagan
వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రజలందరికీ కంటి పరీక్షలు, వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తారు.
కంటివెలుగు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వైఎస్సార్ కంటి వెలుగును ఈనెల 10న ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జూనియర్కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై పథకాన్ని ప్రారంభిస్తారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు వైఎస్సార్ కంటివెలుగు కింద లభించనున్నాయి. మొత్తం ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలవుతుంది.
Last Updated : Oct 10, 2019, 12:56 AM IST