అనంతపురం జిల్లా దిగువ గొల్లహట్టి గ్రామంలో అధికార, విపక్ష పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు నిన్న ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దిగువ గొల్లహట్టి గ్రామం వరకు గెలుపొందిన అభ్యర్థులు ప్రదర్శనగా వెళ్లారు. ఆ సమయంలో టపాసులు కాల్చటంతో రెండు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. దీంతో వైకాపా వర్గీయులు తెదేపా వర్గంపై దాడి చేశారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడటంతో పాటు.. తెదేపా నాయకులకు చెందిన 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను వారించారు.
వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ.. 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసం - దిగువ గొల్లహట్టి గ్రామంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య గొడవలు
అనంతపురం జిల్లా మడకశిర మండలం దిగువ గొల్లహట్టి గ్రామంలో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కావటంతో పాటు.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
![వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ.. 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసం clashes between ysrcp and tdp leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11272046-481-11272046-1617525166865.jpg)
వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకులను మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పరామర్శించారు.
ఇదీ చదవండీ..'అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ'