ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ - అనంతపురం జిల్లా నేర వార్తలు

అనంతపురం జిల్లా ఆలూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

clashes-between-two-groups-during-the-election-campaign-in-aluru-ananthapuram-district
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

By

Published : Feb 14, 2021, 2:14 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. డబ్బులు పంచుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు రమేశ్​​పై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రమేశ్ వర్గీయులు, రాజగోపాల్ రెడ్డి వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

9 మందికి గాయం..

ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 9 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న తాడిపత్రి పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి.

'కేసులు నమోదే కాదు.. మానసిక చికిత్స కూడా అందించాలి'

ABOUT THE AUTHOR

...view details