అనంతపురం జిల్లా ఉరవకొండలోని లత్తవరం గ్రామంలో 'జగనన్న పేదల ఇళ్ల పట్టాల' పంపిణీ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. లత్తవరం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 253/1 లో.. మొత్తం 3 ఎకరాల 20 సెంట్ల స్థలం ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు చెందినది. అందులో ముగ్గురు వ్యక్తులకు చెందిన భూమి.. పట్టాల సేకరణలో పోగా మరికొంత స్థలం మిగిలింది.
డబ్బులు చెల్లించకుండా భూసేకరణ..
భూమి కోల్పోయిన భాగానికి గాను.. ప్రభుత్వం ముగ్గురికి రూ.23లక్షలు చెల్లించింది. అయితే డబ్బులు అందని ఆనంద్, అతని కుమార్తె రోజా భూసేకరణలో కోల్పోయిన భూమి తమదేనని.. తమకు డబ్బులు చెల్లించకుండా ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబంలోని మిగిలిన సభ్యులు ఓరల్ అగ్రిమెంట్ల ద్వారా భూ సమస్యను పరిష్కరించుకుని.. వాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందినట్లు తెలిపారు. ఈ విషయమై.. తాము ఇప్పటికే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వారు అన్నారు.
ఆనంద్ కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడి