అనంతపురం, కడప జిల్లాల్లో తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన.... చిత్రావతి రిజర్వాయర్ నిర్మాణం 2009లోనే పూర్తైంది. జలాశయం పరిధిలోని 4 ముంపు గ్రామాల్లో మర్రిమాకులపల్లి కూడా ఒకటి. ఇప్పుడు పూర్తి సామర్థ్యం మేరకు..... 10 టీఎంసీల నీరు నిల్వచేయాలనుకున్న అధికారులు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఓ వైపు రిజర్వాయర్ను నీటితో.. నింపుతున్నారు.
అది గ్రామంలోకి ఒక్కో అడుగు చొచ్చుకొస్తోంది. ఐతే.. పరిహారంపై అసంతృప్తిగా ఉన్న గ్రామస్థులు... ప్రభుత్వానికి తమ ఆవేదన వెలిబుచ్చారు. 134 మందికి నేటికీ పరిహారం అందలేదని.... ఆరోపించారు. 2006లో పునరావాస ప్యాకేజీ ప్రకటించారని, ఇప్పుడు 2020ని ప్రామాణికంగా తీసుకుని..... 18 ఏళ్లుదాటిన అందరికీ పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
పోలీసుల ప్రహారాలో కూల్చివేతలు...