ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చాందిని మసీదులో చోరీ కేసు నిందితుడు అరెస్ట్

By

Published : Nov 20, 2020, 9:11 PM IST

చాందిని మసీదులో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. నిందితుడి నుంచి రూ. 14,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషించాయి.

chandini-
chandini-

అనంతపురంలోని చాందిని మసీదులో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17న మసీదులోని హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును అపహరించాడు. నిఘానేత్రాల ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించారు. అతని నుంచి రూ.14,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details