ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మడకశిరలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం

By

Published : Dec 7, 2020, 6:45 AM IST

Updated : Dec 14, 2022, 3:05 PM IST

అనంతపురం జిల్లా మడకశిర గ్రంథాలయంలో విద్యార్థులకు 'చదవడం మాకిష్టం' అనే కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారులు నిర్వహించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు.

madakashira latest news
మడకశిరలో "చదవడం మాకిష్టం" కార్యక్రమం

అనంతపురం జిల్లా మడకశిర గ్రంథాలయంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారులు నిర్వహించారు. విద్యార్థులతో పత్రికలు, కథలు చదివించి వారిలో చదవు పట్ల ఆసక్తి కలికగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రంథాలయ అధికారులు కథలు, జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాల అంశాన్ని చదివి వినిపించారు. తిరిగి విద్యార్థులతో అదే అంశాన్ని చదివించారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Last Updated : Dec 14, 2022, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details