ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం - andhra-karnataka border
కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్ద కె.ఎస్.ఆర్.టి.సి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
![ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3211257-682-3211257-1557222997580.jpg)
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం
బెంగళూరు నుంచి వస్తున్న కె.ఎస్.ఆర్.టి.సి బస్సు బాగేపల్లి సమీపంలోని ఐటిఐ కళాశాల వద్దకు రాగానే కంటైనర్ను ఢీకొంది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.