ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నాన్న కుమారుడిని చంపిన పెదనాన్న కుమారులు - గొర్రెపల్లి క్రైం న్యూస్

ఆస్తుల కోసం రాజుకున్న వివాదం... ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వరుసకి సోదరులైన వారే దాడికి తెగబడి చంపేశారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గొర్రెపల్లిలో జరిగింది.

murder
ఆస్తి కోసం హత్య

By

Published : Jan 18, 2021, 7:20 AM IST

అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి హత్యకు కారణమైంది. అన్నదమ్ములైన జూతప్ప, దాలప్ప మధ్య ఆస్తి గురించి 15 రోజులుగా వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలో జూతప్ప కుమారులైన నరేంద్ర, ఓబిలేశు, నరసింహా... దాలప్ప కుమారులపై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో చినరాజప్ప మృతి చెందగా.. అతని సోదరుడు చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details