రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు దుర్మరణం
అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు శంకర్గల్లు గ్రామానికి చెందిన అన్నాచెల్లెలుగా గుర్తించారు. స్థానికులు వారిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని మృతులను చూసి బోరున విలపించారు.
వాహన ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం