ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా బోలికొండ రంగనాథస్వామి రథోత్సవం - anantapuram latest news

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ బోలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. రథోత్సవ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

brahmotsavalu
వైభవంగా శ్రీ శ్రీ శ్రీ బోలికొండ రంగనాథ స్వామి రథోత్సవం

By

Published : Feb 27, 2021, 10:18 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ బోలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి మూలవిరాట్టును ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో ఘనంగా రథోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details