ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్న అహోబిలం జలాశయంలో... ఒకరి మృతదేహం లభ్యం - body found in penna ahobilam reservoir

పెన్నఅహోబిలం జలాశయంలో పడి శనివారం గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.

body-found-in-penna-ahobilam-reservoir
పెన్న అహోబిలం జలాశయంలో... ఒకరి మృతదేహం లభ్యం

By

Published : Jan 19, 2020, 11:38 PM IST

పెన్న అహోబిలం జలాశయంలో... ఒకరి మృతదేహం లభ్యం

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్న అహోబిలం జలాశయంలో శనివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పండగ సెలవులు కావడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 15 మంది గుంతకల్లు వాసులు పెన్నఅహోబిలం వచ్చారు. నీటిలో ఆడుకుంటున్న సమయంలో ఉద్ధృతికి సాయికృష్ణ (09) కొట్టుకుపోయాడు. పిల్లాడిని రక్షించే క్రమంలో బాలుడి చిన్నాన్న హనుమంతు గల్లంతయ్యాడు. వీరి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఆదివారం ఉదయం ఏటిగంగమ్మ సమీపంలో హనుమంతు మృతదేహం లభ్యమైంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details