ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంధుల పెళ్లి - ananthapuram district

అనంతపురంలో సాయి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇద్దరు అంధుల వివాహాన్ని కరోనా నిబంధనల ప్రకారం ఘనంగా చేసిన్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ananthapuram district
అనంతపురంలో ఘనంగా అందుల పెళ్లి

By

Published : Jul 27, 2020, 1:08 AM IST

అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అంధుల వివాహాన్ని సాయి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిపారు. నగరానికి చెందిన సాయి కృష్ణ, లావణ్య పుట్టకతోనే అంధులు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి కుటుంబం సాయి సంస్థను ఆశ్రయించినట్లు సంస్థ నిర్వాహకుడు విజయ్ సాయి తెలిపారు. దాతలు హిందుపురానికి చెందిన రాజగోపాలయ్యా, అనంతపురానికి చెందిన నాగభూషణం సహాయం అందించడంతో కరోనా వేళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి వివాహం చేశారు. నగర శివారులోని శివాలయంలో పెళ్లి జరిగిన ఈ జంటకు జిల్లా అంధుల ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు జలందర్, నారాయణ, జిలాన్, మురళి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details