ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2023, 10:16 PM IST

ETV Bharat / state

జవాన్​పై వైఎస్సార్సీపీ నాయకుల దాడి.. అమిత్​ షా దృష్టికి తీసుకువెళ్తాం: బీజేపీ నాయకుడు

YSCRP Leaders Attacked On Army Jawan: అతను దేశాన్ని కాపాడే జవాన్. తన ఊరిలో జాతర జరుగుతుంటే ఇంటికి వచ్చాడు. వైఎస్సార్సీపీ నాయకుడి కారు దారికి అడ్డంగా ఉండటంతో పక్కకు తీయమని చెప్పడమే ఆయన చేసిన నేరం. మాకే చెప్తావా అని కాపు కాసి దాడి చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ నాయకుడు సూర్య నారాయణ స్పందించారు.

YCP Leaders Attacked On Army Jawan
జవాన్​పై వైఎస్సార్సీపీ నాయకుల దాడి

జవాన్​పై వైఎస్సార్సీపీ నాయకుల దాడి.. అమిత్​ షా దృష్టికి తీసుకువెళ్తాం: బీజేపీ నాయకుడు

YSCRP Leaders Attacked On Army Jawan : దేశాన్ని కాపాడే ఓ ఆర్మీ జవాన్‌పై వైఎస్సార్సీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. పంట పొలాల్లో వెంటాడుతూ, జవాన్​పై దుర్భాషలాడుతూ కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతను వైఎస్సార్సీపీ నాయకులు నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. తాజాగా బీజేపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ జవాన్​ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం :శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో ఆర్మీ జవాన్ పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. ఈ సంఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డి పై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకొని బుధవారం సాయంత్రం ఆసుపత్రిలో బాధితున్ని ఆయన పరామర్శించారు. దాడి జరిగిన సంఘటన మీద ఆరా తీశారు. అధైర్య పడవద్దని బీజేపీ మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మా ప్రభుత్వం వచ్చాక కేసులు రీఓపెన్ చేస్తాం :ఈ సందర్భంగా సూర్య నారాయణ మాట్లాడుతూ ధర్మవరంలో గత నాలుగు సంవత్సరాలుగా రౌడీ రాజ్యం నడుస్తుందని, ఇక్కడ ఎవరేం మాట్లాడినా, ప్రశ్నించినా దాడులు చేస్తారు లేదా చంపుతారని అన్నారు. ఒక ఆర్మీ జవాన్​కు కూడా ధర్మవరంలో రక్షణ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని అయితే వారు ఏదో విధంగా కేసులు నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ రీఓపెన్ చేస్తామని, ఎవరిని వదిలి పెట్టే పరిస్థితి లేదని సూర్య నారాయణ అన్నారు.

అసలు ఏమి జరిగింది :వైఎస్సార్సీపీకి చెందిన జడ్పీ వైస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి దారికి అడ్డంగా తన బండిని పెట్టాడు. దీంతో సమరసింహా రెడ్డి.. వాహనం రోడ్డుకు అడ్డంగా ఉంది కాస్త పక్కకు తీయమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో డ్రైవర్ ఆగ్రహంతో చెంది ఇది సుధాకర్ రెడ్డి వాహనం దీన్నే పక్కకు తీయమంటావా అంటూ సమరసింహా రెడ్డితో గొడవకు దిగాడు. తమ ఇంటి దగ్గర నుంచి వాహనాన్ని పక్కకు తీయమని, ఆ తర్వాత ఎక్కడైనా పెట్టుకోమంటూ సమరసింహా రెడ్డి తెలిపాడు. అంతే, జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు సమరసింహా రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడి నుంచి తప్పించుకున్న జవాన్.. ఆసుపత్రిలో చేరాడు.

" సమరసింహా రెడ్డి ఓ జవాన్. సోల్జర్​కే రక్షణ లేకుండా పోతే ధర్మవరంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లు చంపినా కేసులు లేకుండా పోతాయని అనుకుంటున్నారు. మేము అధికారంలోకి రాగానే కేసులు తిరగతోడతాం. ఈ పద్ధతి మార్చుకోకపోతే జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. " - సూర్య నారాయణ, బీజేపీ నాయకుడు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details