ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 24, 2020, 9:55 PM IST

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు… ఒకరు మృతి

కోరేవాండ్లపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కిష్టప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

bike accident at korevandla palli
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిమాను కిష్టప్ప(35) మృతి చెందాడు. బూదిలివాండ్లపల్లిలోని తన అత్తగారింటి నుంచి స్వగ్రాగమైన చౌడంపల్లికి తన కుమారుడు రవితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోరేవాండ్లపల్లి సమీపంలో బస్సు ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే కిష్టప్ప మరణించగా… అతని కుమారుడు గాయాలపాలయ్యాడు. క్షతగాత్రున్ని హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details