ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్సిల్ మొనపై అందమైన ఆకృతులు

అంతర్జాతీయ యోగా, సంగీత, పితృ దినోత్సవం సందర్భంగా తనలోకి సూక్ష్మ కళను ప్రదర్శించాడు ఓ కళాకారుడు. పెన్సిల్లపై అందమైన ఆకృతులు రూపొందించాడు.

By

Published : Jun 21, 2020, 6:34 AM IST

beautiful micro arts made on pencil tips
beautiful micro arts made on pencil tips

నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా పెన్సిల్​ మొనపై సూక్ష్మ కలను ప్రదర్శించాడు అనంతపురం రాజీవ్ కాలనీకి చెందిన కళాకారుడు రాజేష్. తండ్రి ప్రేమకు గుర్తుగా తండ్రి వేలు పట్టుకుని ఉన్న చిన్నారి బొమ్మను, నాలుగు రకాల ఆసనాలను, గజ్జెలు కట్టిన పాదాన్ని 3 పెన్సిల్ల మొనలపై చెక్కాడు.

ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, ఆరోగ్యం కోసం నిత్యం యోగా చేయాలని, నృత్యం ఇష్టమున్నవారు నృత్య కళలో రాణించాలని ఆశిస్తూ వీటిని రూపొందించినట్లు రాజేశ్ తెలిపాడు. ఈ కళాకృతులను కాలనీవాసులు, చిన్నారులు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details