ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2020, 3:24 PM IST

ETV Bharat / state

కరోనా రాక్షసి... అయ్యింది చక్కని బొమ్మ

కరోనా వైరస్​పై అవగాహన కల్పించేందుకు అనంతపురం క్లాక్​ టవర్​ వద్ద కొవిడ్​-19 బొమ్మ గీశారు. పెయింటింగ్ ఆర్టిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ చిత్రం వేశారు.

awareness on corona with corona picture at ananthapur
కరోనా అవగాహన చిత్రం

కరోనా అవగాహన చిత్రం

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో అనంతపురంలో చిత్రకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని క్లాక్​ టవర్​ వద్ద కరోనా వైరస్ అవగాహన చిత్రాన్ని వేశారు. పెయింటింగ్ ఆర్టిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ చిత్రం వేసినట్లు తెలిపారు. ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు... చిత్రకారులు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిత్రం ప్రదర్శించారు. అటుగా వస్తున్న వాహనదారులకు పోలీసులు చిత్రాన్ని చూపి అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details