అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. 42వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో.. నగదు చోరీ చేయడానికి దుండగులు తీవ్రంగా ప్రయత్నించారు. అర్ధరాత్రి సమయంలో చొరబడి ఏటీఎం మిషన్ని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లాలనుకున్నారు. కానీ ఏటీఎం తెరుచుకోకపోవడంతో రోడ్డుపైనే పడేసి... పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం.. మొరాయించిన యత్రం - అనంతపురంలో ఏటీఎంలో చోరీ వార్తలు
అనంతపురం జిల్లా విడపనకల్లోని ఓ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. మిషన్ని పగలకొట్టేందుకు చాలా శ్రమించారు. కానీ అది తెరుచుకోకపోవడంతో రోడ్డుపైనే పడేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లో జరిగింది.
![ఏటీఎంలో చోరీకి యత్నం.. మొరాయించిన యత్రం Attempting to steal ATM at midapanakal in ananthapur distict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7440106-709-7440106-1591072855576.jpg)
Attempting to steal ATM at midapanakal in ananthapur distict