ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెనుకొండలో లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు

By

Published : May 13, 2020, 9:40 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో నిత్యావసర దుకాణాలపై మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై 11 కేసులు నమోదు చేశారు.

Attacks by Legal Metrology Officers at penukonda
పెనుకొండలో లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో నిత్యావసర దుకాణాలు, కూరగాయలు, ఔషధ దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్ముతున్న దుకాణదారుల పై పదకొండు కేసులు నమోదు చేయగా ప్యాకేజి వస్తువుల పై తయారీదారుని వివరాలు, అమ్మకపు ధర, తయారైన నెల ఇతర వివరాలు లేనందున మరో మూడు నమోదు చేశారు. మెుత్తం పద్నాలుగు కేసులు నమోదు చేసి రూ. 1,05,000 అపరాధ రుసుమును విధించారు. ఈ దాడులలో అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి, ఇన్​స్పెక్టర్​ ఎం. మహమ్మద్ గౌస్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రమేశ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: బత్తాయి వ్యాపారులకు కలెక్టర్​ అనుమతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details