అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం యోగివేమన ప్రాజెక్టు వద్ద ఇద్దరిపై దాడి జరిగింది. ద్విచక్ర వాహనంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.