ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల కస్టడీకి జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డి - Arrest of accused in BS-3 vehicle forgery case

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా ఫోర్జరీ చేసి అమ్మిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను కూడా తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arrest of accused in BS-3 vehicle forgery case
పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్ రెడ్డి

By

Published : Jun 20, 2020, 4:06 PM IST

Updated : Jun 20, 2020, 7:16 PM IST

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభియోగంపై రిమాండ్​లో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ విచారించేందుకు కడప నుంచి అనంతపురం తీసుకువచ్చారు. వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ ​స్టేషన్​లో ప్రత్యేకంగా ఓ గదికి సీసీ కెమెరాలు అమర్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాది రవికుమార్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరగనుంది.

మరో ముగ్గురు అరెస్టు...

ఇదే కేసుకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాడిపత్రి పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో దివాకర్ ట్రాన్స్​పోర్ట్​ మేనేజర్ నాగేశ్వర్​రెడ్డి, ఆకుల రమేష్, గుత్తా సోమశేఖర్​లను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాదాపు 70 లారీలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:అమాయకులను నమ్మబలుకుతాడు... అందినకాడికి దోచుకుంటాడు

Last Updated : Jun 20, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details