కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. కొవిడ్ కట్టడి కోసం ఒక్కో జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు కర్ఫ్యూతోపాటు లాక్డౌన్ సైతం విధించాలని డిమాండ్ చేశారు. సంక్షోభం కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతుండగా.. వారికి నెలకు రూ.7,500 ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా నిత్యవసర సరకులు పంపిణీ చేయాలన్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం