అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. స్వామివారు బ్రహ్మరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవానికి ముందు అర్చకులు కలశస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మరథాన్ని రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.