ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఊరికి ఎవరూ రావొద్దు.. ఊరి నుంచి ఎవరూ వెళ్లొద్దు' - అరకటివేములలో కరోనా పాజిటివ్ వార్తలు

కరోనా వ్యాప్తిస్తున్న వేళ.. అధికారుల కంటే గ్రామస్తులే అప్రమత్తంగా ఉంటున్నారు. ఓ గ్రామంలోని వ్యక్తికి కరోనా సోకిందని అక్కడికి ఎవర్నీ రానివ్వట్లేదు. అక్కడి గ్రామస్తులంతా.. గడప దాటి బయటకు పోకుండా ఆంక్షలు విధించుకున్నారు.

announcement on corona with  traditional indian drum in arakativemula
అరకటివేములలో కరోనాపై డప్పు చాటింపు

By

Published : Jun 3, 2020, 3:21 PM IST

"మా ఊరికి ఎవరూ రావొద్దు.. ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దు" అంటూ అనంతపురం జిల్లా అరకటివేముల గ్రామంలో డప్పు చాటింపు (టముకు) వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంపై.. అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కంటే ముందే స్పందించిన గ్రామస్తులు.. ఈ మేరకు ఆంక్షలను విధించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. అందరికీ సూచించారు. మరోవైపు.. కరోనా సోకిన వ్యక్తి కాంటాక్ట్స్​ను పోలీసులు గుర్తించారు. అందరినీ క్వారంటైన్​కు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details