ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్లెల్లో సమావేశాలు.. ప్రజలకు హెచ్చరికలు

By

Published : Apr 26, 2020, 12:05 PM IST

లాక్ డౌన్ పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నవారికి.. పోలీసులు ప్రత్యక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. జిల్లాలోని పల్లెల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కరోనాపై అవగాహల కలిగిస్తున్నారు. ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు.

police worned to pople
తలుపుల పోలీసుల వినూత్న ప్రచారం

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు పోలీసులు ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి తీరుపై కఠినంగా స్పందిస్తున్నారు. అనంతపురం జిల్లా తలుపుల ప్రాంత పోలీసులు.. అక్కడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలతో సమావేశం అవుతున్నారు. లాక్ డౌన్ పై ప్రకటనలు చేస్తున్నారు. కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వాహనాలు స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

పోలీసు జీపు బోల్తా: ఎస్సై సహా ఐదుగురికి గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details