ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా వైరస్​పై ఆటోల ద్వారా అవగాహన

By

Published : Jun 30, 2020, 3:06 PM IST

కరోనా వైరస్​పై ప్రజలకు అనంతపురం పోలీసులు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కొందరు వ్యక్తులు నిబంధనలు మరచి ప్రవర్తిస్తున్నారని... వారి కోసమే ఈ ప్రచార వాహనాలను ఏర్పాటు చేశామని పట్టణ సీఐ తెలిపారు. ప్రజలు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ananthapuram police giving corona awareness programme by autos
జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఐ ప్రతాప రెడ్డి

అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తున్నందున నగర పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రజలకు ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఐ ప్రతాప రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details