ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెం.2 రద్దు చేయాలని మంత్రి శంకరనారాయణకు వినతి - జీవో నెంబర్​ 2పై మంత్రి శంకరనారాయణను కలిసిన పంచాయతీ కార్యదర్శులు న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 2ను వెంటనే ఉపసంహరించుకోవాలని అనంతపురం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి శంకరనారాయణకు వినతిపత్రం అందించారు.

జీవో నెం.2 రద్దు చేయాలని మంత్రి శంకరనారాయణకు వినతి
జీవో నెం.2 రద్దు చేయాలని మంత్రి శంకరనారాయణకు వినతి

By

Published : Mar 29, 2021, 5:19 PM IST

జీవో నెంబర్​ 2ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. పెనుకొండలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు.

జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరుతూ పెనుకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద నుంచి పట్టణంలోని మంత్రి శంకరనారాయణ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరారు. రేపటి నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details